FGG TIMES

సుప‌రిపాల‌నే ధ్యేయంగా

Editor: T. Vivek 
Associate Editor: Prof. Raghuram Rao Akkinepally

Vol. No. II  |  Issue No. 5  |  Monthly News Letter  | May 2026 

IN FOCUS

Geopolitics of ‘Permanent’ Conflict: What Recent Wars Reveal Beyond the Second World War

The contemporary world appears to have perfected a peculiar art form: the simultaneous conduct of war and diplomacy. Missiles fly across borders at midnight; ceasefire proposals emerge before dawn. Leaders threaten annihilation in televised speeches and then dispatch negotiators to luxury hotels in neutral capitals. One week the world hears the language of Armageddon, the next week the vocabulary of “de-escalation mechanisms,” “strategic restraint,” and “confidence-building measures.” The ongoing Russia–Ukraine conflict, the recurring Iran–Israel confrontation, and the larger American strategic entanglement in West Asia have all displayed this strange geopolitical choreography — war punctuated by negotiation, negotiation interrupted by war.

To many observers this appears unprecedented, even irrational. Yet history suggests otherwise. The Second World War too witnessed backchannel contacts, secret feelers, temporary arrangements, and diplomatic maneuvering. But the essential difference lies not in the existence of negotiations, but in the nature of the wars themselves. The distinction is profound enough to reveal nothing less than the transformation of the global political order.

The Second World War was, in every meaningful sense, a total war. Nations did not merely seek advantage; they sought absolute victory. The ideological stakes were existential. Nazi Germany was not fighting for border adjustments or limited strategic leverage; it sought continental domination and racial empire. Imperial Japan envisioned a militarised Asian sphere under Tokyo’s supremacy. The Allied powers, after considerable hesitation in the early years, concluded that no stable settlement was possible without the complete destruction of Axis military power.

Thus emerged the doctrine of “unconditional surrender” — perhaps one of the most consequential geopolitical formulations of the twentieth century. Once this doctrine was adopted, diplomacy became largely subordinate to military annihilation. Negotiations existed, yes, but mostly as tactical instruments or intelligence exercises. Secret contacts occurred through Switzerland, Sweden, and the Vatican. German officials occasionally explored possibilities of separate peace with Western powers. Local truces happened for prisoner exchanges and humanitarian reasons. Yet none of these altered the central logic of the conflict.

The war machine rolled forward with terrifying finality because every major power believed compromise itself to be dangerous. The Soviet Union feared any Western accommodation with Hitler. Britain feared a revived German militarism. America believed partial peace would merely postpone another catastrophe. Consequently, World War II became not a managed conflict but an apocalyptic contest of industrial capacity, ideological conviction, and military endurance.

Modern wars are fundamentally different creatures.

The Russia–Ukraine conflict, despite its ferocity, is not structured as a war of unconditional surrender. Neither Russia nor NATO desires direct total confrontation. Ukraine seeks restoration of sovereignty and security guarantees, but the wider Western coalition simultaneously fears uncontrolled escalation. Russia, despite aggressive rhetoric, calibrates its actions with evident awareness of NATO’s red lines. Every missile strike is shadowed by strategic caution.

The same paradox is visible in the unfolding Iran–Israel confrontation. Israel speaks the language of existential security; Iran invokes resistance and sovereignty; the United States projects deterrent power across the region. Yet behind the thunderous rhetoric operates an elaborate architecture of restraint. Proxy engagements, calibrated retaliation, indirect diplomacy through Gulf intermediaries, covert operations, sanctions, cyber warfare, and carefully measured escalation together constitute a strange new grammar of conflict.

This transformation arises primarily from the nuclear age. Nuclear weapons altered not merely military calculations but the philosophical meaning of war itself. During World War II escalation possessed no final ceiling. Cities burned, armies advanced, and destruction expanded until one side physically collapsed. Today escalation carries within it the spectre of planetary catastrophe. Strategic planners understand that direct confrontation among major powers could spiral into nuclear exchange, global economic collapse, cyber paralysis, and civilisational disorder.

Thus modern states fight with one hand while restraining themselves with the other.

This condition has produced what strategic theorists sometimes call “managed instability” — a permanent geopolitical condition in which powers compete intensely but avoid terminal escalation. Wars therefore no longer proceed in linear fashion toward decisive victory. Instead they oscillate between battlefield violence and diplomatic containment.

Economic globalisation has deepened this phenomenon. The world of the 1940s was economically fragmented compared to today’s deeply integrated system. Contemporary supply chains, energy flows, semiconductor production, financial markets, digital infrastructure, and maritime trade routes bind rivals together in uncomfortable interdependence. Europe sanctions Russia while worrying about energy security. America pressures Iran while anxiously monitoring oil prices and shipping lanes. China competes strategically with the United States even as both economies remain structurally intertwined.

Total war in such conditions risks mutual economic asphyxiation.

Consequently, modern warfare increasingly resembles prolonged coercive bargaining rather than outright conquest. Sanctions replace sieges; drones replace mass infantry; cyber sabotage replaces strategic bombing campaigns; information warfare accompanies military operations with almost equal importance. Every conflict now unfolds simultaneously on battlefields, financial markets, television studios, and social media timelines.

Indeed, public perception itself has become a strategic theatre. During World War II governments controlled information with far greater efficiency. Today satellite imagery, mobile phone footage, social media narratives, and instantaneous global broadcasting shape political pressure in real time. Governments therefore wage narrative wars alongside military ones. Ceasefires are sometimes announced less to end conflict than to shape international opinion, reassure allies, calm markets, or regain diplomatic legitimacy.

Equally significant is the disappearance of clear war termination objectives. In 1945 the endpoint was unmistakable: Berlin captured, Tokyo subdued, Axis regimes dismantled. Modern conflicts lack such crystalline conclusions. What exactly constitutes victory in Ukraine? The complete recovery of territory? Russian strategic defeat? A frozen conflict? Neutrality arrangements? Security guarantees? Similarly, what would decisive victory look like in the Iran–Israel confrontation? The permanent dismantling of Iran’s regional influence? The elimination of proxy networks? Regime transformation? None of these goals appear realistically attainable without costs so catastrophic that all actors hesitate before pursuing them fully.

The result is a new geopolitical landscape defined less by peace or war than by perpetual strategic tension. The old binary distinction between wartime and peacetime is eroding. Humanity increasingly inhabits an intermediate zone — neither stable peace nor total war, but a continuous state of calibrated hostility.

In some respects the Korean War offers a more accurate template for the twenty-first century than World War II. The Korean conflict never truly ended; it merely stabilised into armed suspension. Many contemporary conflicts appear destined for similar trajectories: frozen fronts, recurring crises, periodic negotiations, and endless militarised vigilance.

This may well become the defining condition of our century — not world wars of total mobilisation, but endless geopolitical friction sustained below the threshold of apocalypse. Great powers no longer seek decisive victory in the classical sense because decisive victory itself has become too dangerous, too economically destructive, and potentially too terminal for civilisation.

The tragedy, however, is equally evident. If total war has become unthinkable, durable peace has also become elusive. Humanity has succeeded in preventing global annihilation, but not in constructing lasting political settlements. We now inhabit an age where wars rarely conclude and diplomacy rarely resolves. Instead, conflicts drift endlessly between negotiation tables and missile launchers, between summit meetings and sanctions regimes, between televised outrage and carefully choreographed restraint.

World War II ended with unmistakable historical punctuation. Modern conflicts end with ellipses.

Rairao Ram Mohan Rao
Professor(rtd) O.U

డిలిమిటేషన్: సమాన ప్రతినిధిత్వం – సమాఖ్య సమతౌల్యం మధ్య సవాలు

భారతదేశంలో రాబోయే డిలిమిటేషన్ ప్రక్రియ మరోసారి దేశ రాజకీయ, రాజ్యాంగ చర్చలకు కేంద్రబిందువైంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా “ఒక మనిషి – ఒక ఓటు – ఒకే విలువ” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని బలపరచడం దీని ప్రధాన లక్ష్యం. అయితే భారతదేశంలాంటి విభిన్నతలతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఈ ప్రక్రియ కేవలం గణిత సమీకరణంగా మిగిలిపోకుండా, ప్రాంతీయ సమతౌల్యం, అభివృద్ధి అసమానతలు వంటి అంశాలను ముందుకు తెస్తోంది.

డిలిమిటేషన్ అంటే జనాభా మార్పులకు అనుగుణంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ణయించడం. సిద్ధాంతపరంగా ఇది సమాన ప్రతినిధిత్వాన్ని నిర్ధారిస్తుంది. కానీ ఆచరణలో దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, అభివృద్ధి స్థాయి, వలసల ధోరణి సమానంగా లేవు. ఈ అసమానతలే డిలిమిటేషన్‌ను క్లిష్టమైన అంశంగా మారుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఉత్తర–దక్షిణ విభేదం. దక్షిణ భారత రాష్ట్రాలు—తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్—గత కొన్ని దశాబ్దాల్లో విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించాయి. ఫలితంగా అక్కడ జనాభా వృద్ధి తక్కువగా ఉంది. అదే సమయంలో ఉత్తర భారత రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా కొనసాగుతోంది. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే ఉత్తర రాష్ట్రాలకు అధిక లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశం ఉంది.

ఇది ఒక విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తుంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉండగా, అధిక జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్య న్యాయసూత్రాలకు విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది.

మరో ముఖ్య అంశం గ్రామీణ–పట్టణ అసమానత. పట్టణ ప్రాంతాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాలు విస్తీర్ణంగా ఉండి తక్కువ జనాభాను కలిగి ఉంటాయి. పూర్తిగా జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే పట్టణ నియోజకవర్గాల ప్రాధాన్యం పెరిగి, వ్యవసాయం, గ్రామీణ మౌలిక సదుపాయాల సమస్యలు పక్కన పడే ప్రమాదం ఉంది.

అయితే డిలిమిటేషన్ అవసరం లేదని చెప్పడం సరైంది కాదు. చాలా కాలంగా స్థిరంగా ఉన్న నియోజకవర్గాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేకు అసమానంగా అధిక జనాభా ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ఇది ప్రజాస్వామ్య సమానత్వాన్ని దెబ్బతీస్తోంది. కాబట్టి డిలిమిటేషన్ అనివార్యం.

ప్రధాన ప్రశ్న ఏమిటంటే—ఇది ఎలా అమలు కావాలి? కేవలం జనాభా ఆధారంగా కాకుండా, భౌగోళిక విస్తీర్ణం, అభివృద్ధి సూచికలు, పరిపాలనా అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే సమగ్ర విధానం అవసరం. ఇది గణిత సమానత్వాన్ని కొంతవరకు తగ్గించినా, సమగ్ర న్యాయాన్ని అందించగలదు.

అలాగే ప్రతి రాష్ట్రానికి కనీస ప్రాతినిధ్యాన్ని నిర్ధారించే విధంగా రాజ్యాంగ పరిరక్షణలు అవసరం. దీనివల్ల రాష్ట్రాల మధ్య రాజకీయ సమతౌల్యం కాపాడబడుతుంది. రాష్ట్రాల అంతర్గతంగా మాత్రం జనాభా ఆధారంగా సర్దుబాట్లు చేయవచ్చు.

మరో ముఖ్య అంశం—జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను రాజకీయంగా నష్టపరచకూడదు. ఇందుకోసం ఆర్థిక వనరుల పంపిణీ, కేంద్ర నిధుల కేటాయింపులో సముచిత మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే ఈ అంశంపై రాజకీయ స్థాయిలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలకు సంభవించే ప్రభావాలపై చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వంలో ఉన్న దక్షిణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయడంలో మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షం ఈ అంశాన్ని బలంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో, పార్టీలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా మారుతుంది.

డిలిమిటేషన్ వల్ల ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ వ్యయం కూడా పెరిగే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయలేము. కాబట్టి సభ్యుల సంఖ్య పెంపుతో పాటు పరిపాలనా వ్యయాల నియంత్రణపై కూడా స్పష్టమైన విధానం అవసరం.

మొత్తానికి డిలిమిటేషన్ కేవలం సాంకేతిక ప్రక్రియ కాదు; ఇది ప్రజాస్వామ్య సమానత్వం, సమాఖ్య న్యాయం, పరిపాలనా సామర్థ్యం మధ్య సమతౌల్యం సాధించే కీలక ప్రక్రియ. భారతదేశంలాంటి విభిన్నతల దేశంలో ఒకే ప్రమాణంతో నిర్ణయాలు తీసుకోవడం కంటే, సమగ్ర దృష్టితో ముందుకు సాగడం అత్యవసరం.

రాబోయే డిలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య దిశను ప్రభావితం చేసే కీలక దశ. ప్రతి పౌరుని ఓటుకు సమాన విలువ ఉండేలా చేస్తూనే, ప్రతి ప్రాంతానికీ తగిన స్వరం కల్పించడం నిజమైన సవాలు. అందుకోసం విస్తృత ప్రజా చర్చ, పారదర్శకత, మరియు సమతుల్య విధాన నిర్ణయం అత్యవసరం.

Syed Rafi
Member – Forum for Good Governance

స్థానిక పాలనే సుపరిపాలన

స్థానిక పాలనతో సుపరిపాలన:

ఈనాడు ప్రతి రాజకీయ నాయకుడు, పార్టీ సుపరిపాలన ప్రాముఖ్యాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. సుపరిపాలన భవిష్యత్ అవసరాలను తీర్చేదిగా ఉండాలి. అవినీతిని తగ్గించేదిగా అల్పసంఖ్యాక వర్గాల అణగారిన వర్గాల ఆకాంక్షలను తీర్చేదిగా ఉండాలి. జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, టంగుటూరి ప్రకాశంపంతులు వంటి ఎంతోమంది ప్రముఖులు స్థానిక ప్రభుత్వాల ప్రాముఖ్యాన్ని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని స్థానిక ప్రభుత్వాలతోనే ప్రారంభించి మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు. ప్రజాస్వామ్య విజయం “అధికార వికేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది. అధికార వికేంద్రీకరణ జరగాలంటే స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. స్థానిక ప్రభుత్వం అంటే స్థానిక ప్రజల చేత ఎన్నుకోబడి ఉండాలి. స్థానిక వనరులతో స్థానిక అవసరాలను తీర్చాలి. భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశం రాష్ట్రాల కలయిక. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా స్థానిక అవసరాలను, సమస్యలను తీర్చడానికి ఈ ప్రభుత్వాలకు స్థానిక విషయాల పట్ల అవగాహన. సమయం కానీ ఉండదు. స్థానిక సమస్యలు ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటాయి. అందుకే స్థానిక ప్రభుత్వాల ప్రాముఖ్యం పెరిగింది. స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రజల చేత ఏర్పడడం వలన వారికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండి స్థానిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. భారతదేశంలో స్థానిక సంస్థలు ప్రాచీన కాలంనుండి ఏదో ఒక రూపంలో  ఉన్నాయి. మౌర్యులు, గుప్తుల పరిపాలన కాలంలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నట్లుగా చరిత్రకారులు ఉటంకించారు. మొగలుల కాలంలో వారు కేంద్రీకృత పాలనకు ప్రాముఖ్యం ఇవ్వడం వలన మన దేశంలో స్థానిక పరిపాలన మరుగున పడింది. ఆంగ్లేయుల పరిపాలన లో “లార్డ్ రిప్పన్స్థానిక ప్రభుత్వాల స్థాపనకు, అభివృద్ధికి కృషిచేశారు. అందుకే ఆయనను “స్థానిక సంస్థల పితామహుడుగా అభివర్ణించడం జరిగింది. మన దేశంలోని స్థానిక ప్రభుత్వాలను ప్రముఖంగా రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి: 1. గ్రామీణ, స్థానిక ప్రభుత్వాలు. 2. పట్టణ లేదా నగర స్థానిక ప్రభుత్వాలు. భారత రాజ్యాంగంలో మొదట స్థానిక ప్రభుత్వాల అంశాన్ని రాజ్యాంగంలోని 40వ  అధికరణం లో గల రాజ్యాంగ నిర్దేశిక / ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. రాజ్యాంగ నిర్దేశిక సూత్రాలను విధిగా పాటించాలనే నియమం లేదు. అందుకే స్థానిక ప్రభుత్వాలు  ప్రాముఖ్యాన్ని కోల్పోయాయి. రాజ్యాంగాన్ని అనుసరించి స్థానిక ప్రభుత్వాల అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సూచనల మేరకు స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది.

స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతి పత్తి:

స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలన్న ఆశయంతో 1992 వ సంవత్సరంలో 73, 74 వ రాజ్యాంగ సవరణల  ద్వారా స్థానిక ప్రభుత్వాలకు  రాజ్యాంగ ప్రతి పత్తి ని కల్పించటం జరిగింది. 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్  వ్యవస్థను బలోపేతం చేయగా, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలను, నగర పాలక సంస్థలను బలోపేతం చేయడం జరిగింది. 73,74 రాజ్యాంగ సవరణలను అనుసరించి అన్ని స్థానిక ప్రభుత్వాల కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. గతంలో స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా  జరిపించేవి. పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని రద్దు చేసి సంవత్సరాల కాలం ఎన్నికలు జరిపించని సందర్భాలు చాలా ఉన్నాయి. 73,74 వ రాజ్యాంగ సవరణల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఎన్నికల సంఘం ను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపించాలి. ఏదైనా స్థానిక సంస్థను అనివార్య మైన కారణాల కారణంగా రద్దు చేస్తే, విధిగా ఆరు మాసాలలోపు ఎన్నికలు జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, వారి రాష్ట్రాల్లో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. మన దేశంలో గ్రామీణ, స్థానిక సంస్థలకు, పట్టణ స్థానిక సంస్థలకు నిధులు లేని విధులను అప్పగించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మధ్య జరగవలసిన ఆర్థిక వనరుల పంపిణీపై నివేదికను సమర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటుచేయాలి. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని విస్మరిస్తున్నాయి.  73 వ రాజ్యాంగ సవరణను అనుసరించి గ్రామ పంచాయితీలు గ్రామసభ సమావేశాలను సంవత్సరంలో రెండుసార్లు విధిగా నిర్వహించాలి. 18 సంవత్సరాల వయస్సు నిండి ఆ గ్రామ ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకున్న వారందరూ గ్రామసభలో సభ్యులు. గ్రామసభ సమావేశాలకు సర్పంచి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. గ్రామీణాభివృద్ధితో సంబంధం ఉన్న ప్రభుత్వ సిబ్బంది గ్రామ సభ సమావేశాలకు విధిగా హాజరై, గ్రామ సభ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. 74 వ రాజ్యాంగ సవరణను అనుసరించి గ్రామ పంచాయతీలలో గ్రామసభ మాదిరిగా మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఆ పట్టణ, నగర సభ్యులతో వార్డ్ కమిటీలను ఏర్పాటు చేయాలి. అనేక మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు కమిటీలను ఏర్పాటు చేయటం జరగలేదు. వార్డు కమిటీ ల  ఏర్పాటు వల్ల  తమ అధికారాలు  తగ్గుతాయనే  అనే  అభిప్రాయం  కౌన్సిలర్లలో  ఉంది. స్థానిక పాలనలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం కోసం గ్రామసభలను, వార్డు కమిటీలను బలోపేతం చేయాలి.

రిజర్వేషన్లు:

సమాజంలోని వెనకబడిన వర్గాల ప్రజల కోసం 73, 74 వ  రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించటము జరిగింది. మన దేశ జనాభాలో సుమారు 50% మంది మహిళలు ఉన్నారు. వీరు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మహిళా సాధికారతను ఆశించి అన్ని స్థానిక ప్రభుత్వాలలో 1/3 వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం జరిగింది. గ్రామీణ, పట్టణ, నగర, స్థానిక సంస్థల్లో సామాజికంగా వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన వారికి అన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు.

స్థానిక ప్రభుత్వాల విధులు:

 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ప్రభుత్వాల అధికారాలను, విధులను వివరించడం జరిగింది. రాజ్యాంగం లో 11 వ షెడ్యూల్  ను చేర్చి పంచాయతీ రాజ్ సంస్థల కు 29 అధికారాలు అప్పగించాలని సూచించ డం జరిగింది. ఇందులో ప్రధానంగా  పేర్కొనదగినవి వ్యవసాయం, పశు సంవర్ధక, మత్యపరిశ్రమ, చిన్న నీటిపారుదల, త్రాగు నీరు, దారిద్య్ర నిర్మూలన, రోడ్లు, మార్కెట్ వంటి అంశాలు ఉన్నాయి. 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 12 వ షెడ్యూల్‌ను చేర్చి అందులో మునిసిపాలిటీలకు 18 అధికారాలను అప్పగించడం జరిగింది. ఇందులో ప్రముఖంగా పేర్కొనదగినవి పట్టణ ప్రణాళికలు, భవనాలు, సామాజిక, ఆర్థిక ప్రణాళిక రూపకల్పన, గృహ, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మొదలగునవి. కానీ నేడు స్థానిక సంస్థలకు నిధుల లేని విధులు అప్పగించారనే విమర్శ ఉంది. దురదృష్టవశాత్తు ఈనాడు చాలా స్థానిక సంస్థలు ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు, ఆర్థిక వనరుల కొరత కారణంగా స్థానిక సంస్థలు త్రాగునీటి సమస్య, మురుగు నీటి సమస్య, వరద నీటి సమస్య, దోమల నివారణ, ట్రాఫిక్ సమస్య, రోడ్ నిర్మాణం వంటి సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో స్థానిక సంస్థలకు అవసరానుగుణంగా గ్రాంట్లను విడుదల చేయడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు:

 తెలంగాణ రాష్ట్రం 2014 లో ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడి నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు,540 మండల పరిషత్తుల,32  జిల్లా పరిషత్లున్నాయి. పట్టణాలలో 129 మునిసిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉన్నాయి.  పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రోత్సహించడం కోసం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గ్రామ పంచాయతీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయితీ ల అవార్డులను అందిస్తోంది. 2021-22 సంవత్సరానికి రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ల ను ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో అత్యుత్తమంగా పనిచేసిన పంచాయతీలను ఎంపిక చేసి జాతీయ అవార్డులు అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం 46 జాతీయ అవార్డులు ప్రకటించింది. గమనార్హమైన అంశం ఏమిటంటే ఈ 46 అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుంది. మొత్తం 9 కేటగిరీల్లో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించగా, 4 విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానిదే మొదటి స్థానం.

ముగింపు:

స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. స్వయం పాలన, స్థానిక సంస్థలు లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం మన లేదు. క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యం లేకుండా రాష్ట్రస్థాయిలో,జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం మనజాలదు. వైవిధ్యం కలిగిన స్థానిక సమస్యల పరిష్కారం స్థానిక సంస్థలతోనే సాధ్యం. ప్రజాస్వామ్యం అనే సౌధానికి స్థానిక ప్రభుత్వాలు పునాదులు. ప్రజల నిత్యావసరాలను తీర్చగల సామర్థ్యం స్థానిక సంస్థలకు ఉండాలి. అప్పుడే ప్రజా రంజకమైన  పాలన సాధ్యం. అదే సుపరిపాలన.

Dr. Mohan Rao
Member – Forum for Good Governance

అధికారం చేతిలోనైనా ఉండాలి

 అధికారియై ఉండాలి. లేదంటే అధికారమైనా చేతిలో ఉండాలి. అంటే ఆఫీసర్ లేదంటే ప్రజాప్రతినిధి.. ఆఖరికి పొలిటిషియన్. లేదంటే ఏ పనీ కాదు. ఎవరూ మాట వినరు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా జర్నలిజం వృత్తిలో ఎదురైన సంఘటనలే దీన్ని రూఢీ చేస్తున్నాయి. ఒక సమస్యను ఓ జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తాడు. మరో జిల్లా కలెక్టర్ అట్లెట్లా అంటూ పేచీ పెడతాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఓ భూ సమస్యకు ఓ తహశీల్దార్ పాజిటివ్ గా రిపోర్ట్ పంపించాడు. ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ కూడా రికమండ్ చేశారు. సీసీఎల్ఏ దాకా వెళ్లింది. అక్కడ కొంత కాలం పెండింగులో ఉంచారు. ఆఖరికి మూకుమ్మడిగా అన్నింటినీ రిజెక్ట్ చేశారు. ఇప్పుడు అదే బాధితుడు మళ్లీ అప్లై చేస్తే పాజిటివ్ రాసిన తహశీల్దారే నెగిటివ్ రిపోర్ట్ పంపించాడు. ఆర్డీవో రిజెక్ట్ చేసేశారు. అదనపు కలెక్టర్ కు పాత ఫైల్ చూపిస్తే.. ఔను కదా, ఇదేంది? ఒక్కటే సమస్యకు రెండు రకాల రిపోర్టులు ఎలా రాశారు? నేను ఎంక్వయిరీ చేయిస్తానంటారు. ఆ తర్వాత ఏవో కారణాలతో రిప్లై వస్తుంది. ఆ కారణాలు పాజిటివ్ గా రాసినప్పుడు ఎందుకు లేవు? ఆ తర్వాత ఎందుకు వచ్చాయి? దీనికి అందరి నోటా మౌనమే సమాధానం. అదే అధికారం. అది మా ఇష్టం. మా చేతిలో అధికారం. అందుకే అప్పుడలా, ఇప్పుడిలా. దీని వెనుక ఏం జరిగిందో, ఎలా జరిగింది? అనే ప్రశ్నల కంటే ముందు పాజిటివ్ గా పంపాం, తర్వాత నెగిటివ్ గా పంపిస్తే ఎలా? అన్న స్పృహ కూడా లేదు. దానికి కారణం ఏమిటంటే సదరు అధికారికి సమాధానం చెప్పేందుకు కారణాలు రెడీగా ఉంటాయి. చట్టాలు, సెక్షన్లు, సబ్ క్లాజులు సిద్ధంగా ఉంటాయి. అప్పుడు బాధితుడు ప్రశ్నించేందుకు అవకాశమే లేదు.

పని చేయకూడదనుకుంటే..
అవును చేయకూడదనుకుంటే చేయరు. పని చేయకుండా ఉండేందుకు సెక్షన్లు, సబ్ క్లాజ్ లు దొరుకుతాయి. ఎలాగైనా చేయొచ్చు. రిక్వెస్ట్ చేసినా, తెలిసిన వాళ్లతో చేయించినా డౌట్స్ ఉన్నాయి. క్లియర్ చేసుకోకుండా పని చేస్తే ఇబ్బంది అవుతుంది. వాళ్లకూ ఇబ్బందే. అందుకే ఎంక్వయిరీ చేయిస్తున్నాను. ఆఖరికి రాష్ట్ర స్థాయి అధికారుల చేత ఫోన్లు చేయించినా, సిఫారసు చేయించినా తిరస్కరించడానికి కారణాలు వెతుక్కుంటారు. ఓ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని మండల స్థాయి అధికారికి హెడ్ ఆఫీసు నుంచి వివరించారు. 15 నిమిషాల్లో తప్పు ఎక్కడ ఉన్నదో గుర్తించి సరి చేస్తూ రిపోర్ట్ పంపిస్తే చాలు అన్నారు. కానీ సదరు మండల అధికారికి ఆ పని చేయడం ఇష్టం లేదు. అందుకే అది నాకు అర్ధం కాలేదని, అలా ఎలా చేస్తామని, ఇక్కడ ఖాళీగా ఉన్నామా? అని అనేక రకాల కారణాలు వెతికి.. ఆఖరికి రిజెక్ట్ చేశారు. అదేనండీ అధికారి తలచుకుంటే ఎంతటి పనినైనా సునాయసంగా తిరస్కరించేందుకు అన్ని మార్గాలు కళ్ల ముందే కనిపిస్తాయి. ఇక మీరు ఎంత ప్రయాసపడినా ఆ పని కాదని గుర్తించాల్సిందే. దానికి కారణాలు వారు వెతికారు కదా.. మీరు చట్టాలను గుర్తు చేసినా, సెక్షన్లను వల్లె వేసినా డోంట్ కేర్ అంటారు. అంతెందుకు.. మా వాళ్లే తప్పుగా నమోదు చేశారు. పొరపాటు జరిగింది. దాన్ని సరి చేయలేం. మీరు కోర్టుకు వెళ్లండి. ఓ ఆర్డర్ తెచ్చుకోండి. అప్పుడు చూద్దాం అనే ధైర్యానికి కూడా వెనుకాడని అధికారులు కూడా ఉన్నారు. తప్పు ఉద్యోగి చేస్తే సరిదిద్దే బాధ్యత మీదే కదా అని గుర్తు చేస్తే కోపాలు వస్తాయి. ఆ ఇష్యూని ప్రచారం చేస్తే మండిపాటు. తనకు న్యాయం చేయండని గ్రామ స్థాయి నుంచి డిపార్టుమెంట్ స్టేట్ హెడ్ దాకా తీసుకెళ్లినప్పుడు మండలం, డివిజన్ స్థాయిలోనే కావాలి. మా దాకా ఎందుకొచ్చారని తిప్పి పంపారు. కానీ ఆర్డర్ చేయలేదు. దాంతో సమస్యగానే మిగిలింది. ఇక్కడ ఉద్యోగులు డేటా ఎంట్రీలో చేసిన తప్పును సవరించాల్సిన బాధ్యత, అధికారం వారికి ఉంది. కానీ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే ససేమిరా అంటున్నారు.

పని చేయాలనుకుంటే..
ఓ అధికారికి పని చేయాలని ఉండడం అంటే చాలు. ఇక అది పరిష్కారం అయినట్లే. పరిష్కరించడానికి చట్టాలు, సెక్షన్లు, సబ్ క్లాజ్ లు దొరుకుతాయి. ఆఖరికి రెఫరెన్స్ లు దొరుకుతాయి. ఏయే జిల్లాల్లో, ఏయే రాష్ట్రాల్లో ఎలా చేశారు? ఏయే కేసుల్లో ఎలాంటి తీర్పులు వచ్చాయి? దానికి దీనికి సిమిలారిటీస్ అన్నీ కళ్ల ముందే కదలాడుతాయి. ఇది ఎలాగైనా చేయొచ్చు. గతంలో ఇలాంటిదే ఫలానా అధికారి చేశారు. ఫలానా సర్వే నంబర్ లో చేశారు. అందుకే చేసేయొచ్చు. అదే రెఫరెన్స్ గా పెడదాం అంటూ చేసేస్తారు. అది అధికారం అంటే మరి! ఏదైనా సమస్య పరిష్కారం గురించి ముందే అధికారులతో చర్చించాలి. వారికి కావాల్సిందనో, నచ్చిందనో తెలియదు. కానీ అప్లై చేసిన మరుసటి రోజే పరిష్కారం అవుతుంది. అందుకే ఇటీవల సూర్యాపేటలో ఓ ల్యాండ్ ఇష్యూలో సక్సెషన్ ఫైల్ ని పరిశీలిస్తే అప్లై చేసిన రోజే పరిష్కారమైంది. కనీసం వారసులు ఎవరో తెలుసుకునేందుకు 15 రోజులైనా టైం తీసుకుంటారు. కానీ అక్కడ ఆ అధికారికి ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇలా అప్లై చేయడం, అలా ఓకే చేయడం పూర్తయ్యింది. పలుకుబడి ఉండాలే గానీ మరుసటి రోజు సర్టిఫికేట్ తీసుకురావడం పెద్ద కష్టం కాదు.

అధికారం ఉంటే..
ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి పదవికి ఎందుకు విలువో తెలుసా. వారి చేతిలో అధికారం ఉండడం వల్లే.. మాజీ కాగానే అప్పటి దాకా ఇంటికొచ్చిన ఏ ఉద్యోగి కనిపించడు. అంతెందుకు? ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయరు. అందుకే అధికారంలో ఉన్న ఐదేండ్లల్లోనే అన్నీ పనులు చేయించుకునేందుకు తాపత్రయపడుతుండడం అందరికీ తెలిసిందే. ఆ ఐదేండ్లల్లోనే సంపద పెరుగుతుంది. ఆస్తులు రెట్టింపు అవుతాయి. అందుకే మొదటి సారి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ కి, రెండో సారి పోటీ చేసేటప్పుడు సమర్పించే అఫిడవిట్ కి చాలా తేడా ఉంటుంది. ఆస్తులు డబుల్ అవుతాయి. కంపెనీల్లో పెట్టుబడులు, షేర్లు, బంగారం, ప్రాపర్టీస్ పెరిగిపోతూనే ఉంటాయి. అధికారంలో ఉండడం వల్ల వారి పనులన్నీ చకచకా అవుతుంటాయి. అధికారం చేతిలో ఎందుకు ఉండాలో కొందరు నేతలు చెప్పే మాటలు చాలా మందికి అర్ధం కావడం లేదు. కానీ అధికారుల చుట్టూ, లీడర్ల చుట్టూ.. సమస్యల పరిష్కారం కోసం తిరిగే వాళ్లకు అర్ధమవుతుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంతటి అనుభవం ఉన్నా.. పూర్తి అవగాహన ఉన్నా సరే.. ఆ పని చేయించుకోవాలంటే ‘అధికారం’ ఉండాలి. అందుకే ఆ అధికారానికి జిందాబాద్ కొట్టాలి. ఆ అధికారానికి అనుభవం అవసరం లేదు. చదువు అంత కంటే అవసరం లేదు. ఆఖరికి ఆ అంశాలపై అవగాహన కూడా ఉండాల్సిన పని లేదు. ఒక్క ఫోన్, ఒక్క కాల్ తో పని పూర్తవుతుంది.

శిరందాస్ ప్రవీణ్​కుమార్

ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ ప్రాధాన్య‌త‌

మ‌న ప్ర‌జా ప్ర‌భుత్వాలు, సింగ‌పూర్ అభివృద్ధి మ‌న రాష్ట్రాల్లో సాధించాల‌ని, ప్ర‌తి ఎన్నిక‌ల స‌భ‌ల్లో, చ‌ట్ట స‌భ‌ల్లో చాలా గొప్ప‌గా చెప్పుకుంటారు.  సింగ‌పూర్ దేశం అభివృద్ధి ఎలా చెందింది, అక్క‌డ అవినీతికి తావులేని ప్ర‌భుత్వాలు, ఎలా ఏర్ప‌డ్డాయి అనే అంశాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.  సింగ‌పూర్‌లో 1959వ సంవ‌త్స‌రంలో “లీకువాన్‌యు” నాయ‌క‌త్వంలో ఏర్పాటైన‌, “పీపుల్స్ యాక్ష‌న్‌” పార్టీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, అక్క‌డ అవినీతికి తావు లేకుండా, ప‌రిపాల‌న జ‌రిగింది.  ప్ర‌భుత్వ ఉద్యోగులు, అవినీతికి, పాల్ప‌డితే, క‌ఠిన శిక్ష‌లు అమ‌లుప‌రుస్తూ, ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డితే శిక్ష‌ల‌కు భ‌య‌ప‌డ‌వ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డి, దేశం సుప‌రిపాల‌న దిశ‌గా, న‌డ‌వ‌డం వ‌ల‌న ప్ర‌జ‌లంతా ధ‌నికులుగా, సుఖంగా గ‌డ‌ప‌గ‌లిగారు.  సింగ‌పూర్‌లో స‌హ‌జ‌వ‌న‌రులు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల దేశంలోని మాన‌వ‌వ‌న‌రుల‌ను, 100% ఉప‌యోగించుకొని, ప్ర‌జ‌ల సౌక‌ర్యం, మౌలిక వ‌స‌తులు క‌ల్పించి,  ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థను సౌక‌ర్య‌వంతంగా మార్చి, ఆరోగ్యం మ‌రియు విద్య‌కు  అత్య‌ధిక‌ ప్రాధాన్య‌త‌లు స‌మ‌కూర్చి, త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా నిలిచింది.  ఆ దేశంలో యువ‌కులు, ప్ర‌తి ఒక్కరు దేశ‌భ‌క్తి క‌లిగి, సైన్యంలో చేరి క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌ర్వ‌స‌మాన‌త్వం గ‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఏర్ప‌ర‌చుకున్నారు.  మౌలిక‌స‌దుపాయాలు, ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ మెరుగుప‌డ‌డం వ‌ల‌న‌, అంత‌ర్జాతీయ వాణిజ్యం, టూరిజం పెరిగి దేశ ఆదాయ‌వ‌న‌రులు భారీగా పెరిగాయి.

సింగ‌పూర్ అభివృద్ధికి తోడ్ప‌డిన అంశాలు ప‌రిశీలించిన‌ట్ల‌యితే ముఖ్యంగా మ‌నం అవినీతి ర‌హిత ప‌రిపాల‌న దిశ‌గా అడుగులు వేయాలి.   మ‌న‌దేశంలో గ‌త 75 సంవ‌త్స‌రాలుగా ప‌రిపాలిస్తున్న ప్ర‌భుత్వాల‌ను ప‌రిశీలిస్తే, అవినీతి నిర్మూల‌న‌, మాట‌ల‌కు, కాగితాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది.  అవినీతి మూలాలు, రాజ‌కీయాల నుండే పుట్టుకొస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  ఎందుకంటే మ‌న ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది.  మ‌న నాయ‌కులు ప్ర‌జ‌ల‌చే ఎన్నుకోబ‌డినా, ప్ర‌జా బలంతో కాకుండా ధ‌న‌బ‌లంతో ఎన్నుకోబ‌డి, అధికారంలోకి వ‌స్తున్నారు.  మ‌న ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను, ఆస‌రాగా తీసుకొని డ‌బ్బు వెద‌జ‌ల్లి ఓట్లు కొనే స‌దుపాయం క‌ల్పించుకొని ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌స్తున్నారు.

ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న ప్ర‌కారం ప్ర‌తి అభ్య‌ర్థి త‌న నామినేష‌న్ ప‌త్రంలో విధిగా త‌న ఆస్థులు, త‌న‌పై ఉన్న కోర్టు వ్యాజ్యాలు విధిగా పేర్కొన‌వ‌ల‌సి ఉంటుంది. 

అభ్య‌ర్థులు ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ప్ర‌కారం ఎన్నిక‌ల వ్యయం పార్ల‌మెంటు లోక్‌స‌భ అభ్య‌ర్థికి రూ// 95 ల‌క్ష‌లు, శాస‌న‌స‌భ అభ్య‌ర్థుల‌కు రూ// 40 ల‌క్ష‌లుగా పేర్కొన్నారు.  పైగా అభ్య‌ర్థులు తాము ఎన్నిక‌ల్లో చేసిన ఖ‌ర్చుల వివ‌రాలు కూడా ఒక నిర్థిష్ట గ‌డువులోగా  ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించ‌వ‌ల‌సి ఉంటుంది.  ఈ వివ‌రాలు ఒక స‌మ‌గ్ర ఆడిట్ వ్య‌వ‌స్థ తో ప‌రిశీల‌న చేయించాలి.

అయినా కూడా అభ్య‌ర్థులు పై ఎన్నిక‌ల నియ‌మాల‌ను తుంగ‌లో తొక్కి, ఏకంగా వంద‌ల కోట్లలో ఖ‌ర్చు చేస్తున్నా, ఎన్నికల‌ సంఘం గాని, ఎన్నికైన ప్ర‌భుత్వాలు గాని, ప‌ట్టించుకొని చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు మ‌న‌కు చ‌రిత్ర‌లో కాన‌రావు.   మొన్న‌టికి మొన్న మ‌న శాస‌న‌స‌భ‌కు జ‌రిగిన 2023 ఎన్నిక‌ల్లో ఒక అభ్య‌ర్థి బహిరంగ స‌భ‌ల్లోనే త‌న ఎన్నిక‌ల ఖ‌ర్చు రూ// 70 కోట్ల‌పై మాటే అని చెప్పుకొచ్చారు.  ఈ ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌పై స‌ద‌రు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం వారికి ఫిర్యాదు చేస్తే, వారు సంబంధిత క‌లెక్ట‌రు గారికి విచార‌ణ నిమిత్తం పంపి చేతులు దులుపుకున్నారు.  ఇదే అంశంపై  భార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి వ్రాస్తే, ఎన్నిక‌ల సంఘం వారు ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌పై ఆడిట్ జ‌రుప‌దు మ‌రియు ఆడిట్ చెయ్య‌మ‌ని ఎలాంటి సంస్థ‌ల‌నూ ఆదేశించ‌లేదు అని జ‌వాబు.  అందుక‌ని,  ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ వ్రాసిన ఫిర్యాదుపై ఎలాంటి చ‌ర్య‌లు  తీసుకోలేద‌ని తెలుప‌డం విచార‌క‌రం.  ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌పై ఆడిట్ కూడా జ‌రిపారు కాని, నివేదిక ఇంకా రాలేద‌ని జ‌వాబు వ‌చ్చింది కాని ఆ నివేదిక రాదు.  ఈలోగా స‌ద‌రు ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న‌ల ద్వారా ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధి మంత్రి ప‌ద‌వి కూడా పొంది, త‌న 5 సంవ‌త్స‌రాల స‌భ్య‌త్వం కూడ పూర్త‌యినా, ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌వు.

అవినీతి డబ్బుతో ఎన్నికైన మ‌న ప్ర‌జాప్ర‌తినిధులు, నీతిగా ప్ర‌జాపాల‌న సాగిస్తార‌నుకోవ‌డం పొర‌బాటు.  ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌క్షాళ‌న చేసి నిబంధ‌న‌లు, ఉల్లంఘ‌న‌ల‌కు క‌ఠిన‌శిక్ష‌లు విధిస్తే త‌ప్ప‌, మ‌న ప్ర‌జాస్వామ్యం అవినీతి ర‌హితంగా మ‌నుగ‌డ సాగించ‌లేదు.   ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఖ‌ర్చు చేసిన కోట్ల రూపాయిలు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అంత‌కు రెండింత‌లు రాబ‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ప్ర‌జా ప్ర‌తినిధి అవినీతికి పాల్ప‌డ‌డం స‌హ‌జం.

అమెరికా మాజీ అధ్య‌క్షులు బ‌రాక్ ఒబామా త‌న స్వానుభ‌వాల మాలిక‌గా వెలువ‌రించిన “THE PROMISED LAND” పుస్త‌కంలో ఒక విశ్లేష‌ణ చేశాడు.   లంచ‌గొండులైన స్థానిక అధికారులుగా, ద‌ళారులుగా మారిన ప్ర‌జాప్ర‌తినిధుల ఇష్టా ఇష్టాల‌కు భార‌త్ బందీ అయ్యింది.  మార‌డానికి సుతారామూ అంగీక‌రించ‌ని సంకుచిత బ్యూరోక్ర‌సీ వ‌ల్ల ఇండియా  ప్ర‌గ‌తి ప్ర‌స్థానం కుంటుబ‌డుతోంది.  ప్ర‌జా ప్ర‌తినిధుల‌లో, స‌ర్కారీ సిబ్బందిలో ప‌లువురు ప్ర‌జాసేవ‌కులుగా విధులు నిర్వ‌ర్తించ‌వ‌ల‌సిన వారు ప్ర‌జాపీడ‌కులుగా త‌యారయ్యార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.  అవినీతిప‌రులు, అస‌మ‌ర్థులు, అహంకారులు మొద‌ల‌గు ఎంద‌రికో ఆల‌వాల‌మైన మ‌న భార‌తీయ యంత్రాంగం ప‌నితీరు ఆసియా దేశాల‌న్నింటి మీద అద్వాన్న‌మన్న‌ది  అంత‌ర్జాతీయ అధ్య‌య‌నాల్లో లోగ‌డే తేలిన వాస్త‌వం.

విశ్వ‌స‌నీయ‌త‌, నిజాయితీ, చిత్త‌శుద్ధి క‌లిగిన వారే ప్ర‌జా ప్ర‌తినిధులుగా గాని, ప్ర‌భుత్వ కొలువుల్లో గాని కొన‌సాగేందుకు అర్హుల‌ని సుప్రీంకోర్టు నాలుగేళ్ళ కింద‌టే స్ప‌ష్టం చేసింది.  2025-26 బ‌డ్జెట్ అంచ‌నాల ప్ర‌కారం అన్ని రాష్ట్రాల జీత‌భ‌త్యాలు క‌లిసి వేత‌నాల ప‌ద్దులో ఏడాదికి వెచ్చిస్తున్న మొత్తం రూ// 11.38 ల‌క్ష‌ల కోట్ల‌యితే, వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల జీత‌భ‌త్యాల క్రింద చేసిన కేటాయింపులు రూ// 3.61 ల‌క్ష‌ల కోట్లు.  ఇదే కాకుండా ప్ర‌జాప్ర‌తినిధుల అల‌వెన్సులు, విలాస‌వంత‌మైన ప్ర‌యాణఖ‌ర్చులు, వైద్య ఆరోగ్య ఖ‌ర్చులూ, ఎన్ని కోట్ల‌లో ఉంటుంద‌నేది ఊహించ‌లేము.  ఇదంతా ప్ర‌జాధ‌న‌మే   క‌దా ! పెరిగిపోతున్న అవినీతి కార‌ణంగా సామాన్య‌ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళ్ళేందుకు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంద‌ని, మ‌ద్రాసు హైకోర్టు ఆవేద‌న వ్య‌క్తం చేసింది.  ప్ర‌జ‌ల ర‌క్త మాంసాల‌ను పీల్చేస్తున్న ఈ అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయ‌డానికి ప్ర‌భుత్వాలు చొర‌వ తీసుకోనంత కాలం, పౌర‌సేవ‌ల పంపిణీలో నాణ్య‌త నేతి బీర చందంగానే మిగిలిపోతుంది. 

మ‌న‌దేశంలో పాతుకుపోయిన ఈ అవినీతికి మూలం రాజ‌కీయ అవినీతితోనే మొద‌లైందని చెప్ప‌క త‌ప్ప‌దు.  మ‌న నాయ‌కులు, ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి రావ‌డానికి,  అనేక జ‌నాక‌ర్ష‌క ఉచిత ప‌థ‌కాలు విచ్చ‌ల‌విడిగా ప్ర‌క‌టిస్తున్నారు.  అందుకు కావ‌ల‌సిన వ‌న‌రులు, బ‌డ్జెట్ ఎక్క‌డ నుండి వ‌స్తుంది అని గాని,  ఉచిత ప‌థ‌కాలక‌య్యే వంద‌లు, వేల‌ కోట్ల డబ్బును సంపాదించ‌గ‌ల ఆదాయ వ‌న‌రులు ఉన్నాయా ?  లేదా ? అని ప్ర‌శ్నించే అధికారం ఎన్నిక‌ల సంఘానికి ఉండాలి.

మ‌న తెలంగాణ‌లో మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం పేరున మ‌న ప్ర‌జా ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌డం జ‌రిగింది.  అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత (9-12-2023) నుండి (1-4-2026) వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు రాయితీ క్రింద ఇచ్చిన మొత్తం అక్ష‌రాల‌  రూ// 10,000 కోట్లు.  ఈ సొమ్ము ప్ర‌భుత్వ ఖ‌జానా నుండి టి.ఎస్‌.ఆర్‌.టి.సి. కి చెల్లించి మ‌హిళ‌ల‌కు ఇంత సొమ్ము ఆదా చేసిన‌ట్లు మంత్రిగారు చెప్పి సంబ‌రాలు జ‌రుపుకున్నారు.  అంటే ఈ సొమ్ము మిగ‌తా ప్ర‌జ‌ల వ‌ద్ద ఎక్కువ చార్జీల రూపేణా గాని. ప‌న్నుల ద్వారా గాని వ‌చ్చిన డబ్బు కాదా  ?  అంటే మ‌గ‌వారికి ఛార్జీలు పెంచి, సొమ్ము వ‌సూలు చేసి ఆడ‌వారికి ఉచిత ప‌థ‌కాలు ఇస్తే, అది ప్ర‌భుత్వానికి ఆదా అయిన‌ట్లా ?  ఉచిత ప‌థ‌కాలు ఇస్తున్న‌ప్పుడు దానికి కొన్ని అర్హ‌త‌లు విధించాలి.  ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకునే ఉద్యోగ‌స్థుల‌కూ, వ్యాపారాలు చేసుకునే మ‌హిళ‌ల‌కు కూడా ఉచిత బస్సు ప‌థ‌కం వ‌ర్తింప‌చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం ?  బ‌ల‌హీన, అల్పాదాయ వ‌ర్గాల‌కు మాత్ర‌మే కొన్ని అర్హ‌త‌లు విధించి, రాయితీలు క‌ల్పించిన ప్ర‌భుత్వం ఉచిత బ‌స్సు ప‌థ‌కానికి కూడా, ఆడ‌, మ‌గ తేడా లేకుండా అర్హ‌తల‌ను బ‌ట్టి రాయితీలు క‌ల్పిస్తే బాగుంటుంది.  పోతే, వ‌యోధికుల సంఘాలు ఎంతోకాలంగా బ‌స్సు చార్జీల్లో ఉచిత ప్ర‌యాణం అడ‌గ‌కుండా, క‌నీసం 25% రాయితీ క‌ల్పించాల‌ని అడిగినా ఇంత‌వ‌ర‌కు ఇవ్వ‌లేదు.  ఎన్నో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించి, ఎన్నిక‌ల్లో గెలుపు సాధించిన ప్ర‌భుత్వాలు, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేశారు ?  ఒక‌వేళ హామీలు అమ‌లు చేయ‌న‌ట్ల‌యితే, ప‌థ‌కాలు న‌మ్మి ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన‌ట్లే క‌దా !  ఇలా హామీలు అమ‌లు చేయ‌ని ప్ర‌భుత్వాల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసే అధికారం కోర్టుల‌కు గాని, ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌కు గాని, ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను కాపాడాల్సిన రాష్ట్ర గ‌వ‌ర్న‌రుకు గాని క‌ల్పించాలి.

తెలంగాణ విష‌యానికి వ‌స్తే, ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన‌, కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం హామీ త‌ప్ప మిగ‌తా ఏదీ అమ‌లుప‌ర‌చ‌లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించ‌డం త‌ప్ప‌ ప్ర‌స్థుత ప్ర‌భుత్వాన్ని 2029 వ‌ర‌కు భ‌రించ‌డం త‌ప్ప‌ ఏమీ చేయ‌లేరు.  ప్ర‌జ‌ల‌చే ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేన‌ప్పుడు, వారు ఎన్నుకోబ‌డిన స‌మ‌యం పూర్త‌య్యే దాకా భ‌రించ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగిందేమీలేదు.

అవినీతిమ‌య ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల క‌మీష‌న్ స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగి, నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌కంగా అవినీతి ర‌హితంగా, ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే త‌ప్ప ప్ర‌జాపాల‌న అనే దానికి అర్థ‌మే లేదు.  ఆ సంస్థ ప‌రిపూర్ణ సంస్థ కానేర‌దు.

యం. బుచ్చయ్య‌
మెంబ‌రు
ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

CITIZEN'S SPEAK

We request your organization—which constantly strives for good governance—to bring a critical shortcoming within the state’s education system to the attention of the government. Although government schools in Telangana are equipped with library facilities, the absence of librarians to manage them is depriving students of access to knowledge.

In an effort to resolve this issue, we earnestly request you to bring the following points to the notice of the government and the Honorable Chief Minister, and to take the initiative to ensure that posts for librarians are included in the upcoming DSC notification.
 
Yours faithfully,
Telangana Library Science Asperents
CLICK TO VIEW

FGG IN NEWS

FGG IN ACTION

FGG Submitted representations to various departments in the month of APRIL 2026

  • To the Chief Minister regarding request to take up cleaning of Musi river before taking up construction of Temples etc. –   on    2-4-2026
  • To the Chief Minister regarding Death of 14 people due to consumption of adulterated Toddy – Prohibition & Excise department not taking action to pursue the cases – on          7-4-2026

FGG submitted following RTI letters to various departments in the month of APRIL 2026

  1. To the PIO, O/o Vice Chancellor, RGUKT, IIIT Basar regarding University budget, staff details etc. –   on   8-4-2026
  1. To the PIO, O/o Prl. Secretary, General Administration Department regarding number of Advisors and Chairmen of different Corporations in Telangana
  1. To the PIO, O/o Chief Engineer, I & CAD department , regarding Request for Renovation of Minor Irrigation tanks in villages – Mission Kakatiya information

FGG TIMES

Forum For Good Governance

H.No.6-1-69, Flat No.204,
G.K.R. Mansion Saifabad,
Lakdikapool, Hyderabad,
Pin : 500004

Phone: 040 2323 0334

Editorial Board:
M. Padmanabha Reddy I.F.S.(R) (President)
Soma Srinivas Reddy B.E (Secretary)

⁠Interested may send articles/ letters/ News to
E-mail: timesfgg@gmail.com